వెన్నుపోటుకు రెండేళ్లు., ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ విమర్శల వర్షం..
తణుకు: “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మహిళలు, రైతులు, నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలపై కేసులు పెట్టి భయపెట్టే రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాటం కొనసాగిస్తుందని నాయకులు స్పష్టం చేశారు. కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, యువత, ప్రజా సంఘాల ప్రతినిధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
Posted on 12-06-2026 10:44 AM | by Kalyan
View Latest Deals & Offers
🏠
🔗
View Latest Deals & Offers


